క్రిష్ దర్శత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తం తెలియజేసే విధంగా క్రిష్ ఈ సినిమాను రూపొందించనున్నారు. సినిమాలోని ప్రతీ సన్నివేశం ఎంతో కీలకంగా ఉండబోతోందట. ఇంతవరకూ ఎవ్వరూ టచ్ చేయని చారిత్రక నేపధ్యంగా ఈ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా తెరకెక్కిస్తున్నామంటున్నారు క్రిష్.
ఈ సినిమాలో శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. శ్రియ ఇంతవరకూ తన కెరీర్లో చేయని పాత్రని ఈ సినిమాలో పోషిస్తోంది. అందుకోసం తన ఫిజిక్ని కూడా మార్చుకుందని సమాచారం. శాతకర్ణి భార్యగా ఆమెలోని రాణీతనం ఉట్టిపడేలా తన శరీరాకృతిని మలచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా శ్రియ కెరీర్లో ఒక బెస్ట్ మూవీ కానుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి కీలక ఘట్టాలు, యుద్ధ సన్నివేశాలను చాలా ఘనంగా తెరకెక్కించారు క్రిష్. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ తాజా షెడ్యూల్లో రాజదర్భార్ నేపధ్యంలో చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాలో బాలయ్య నటన, చెప్పే సంభాషణలు అదరహో అన్పిచేంతలా ఉంటాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి హేమామాలిని శాతకర్ణి తల్లి పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్ర సినిమాకి కీలకం. తాజా షెడ్యూల్లో ఆమె కూడా పాల్గొననున్నారు.