ఉలిక్కి పడ్డ ఉమా మాధవరెడ్డి!

తీగ లాగితే డొంక కదిలింది అన్న చందాగా రౌడీ షీటర్ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత రాజకీయ,పొలిసు వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.తాము పాలు పోసి పెంచిన పామే తమను కరుస్తుంది అన్న చందాగా తయారైంది నయీమ్ వ్యవహారం.చివరికి ఎవరికీ వారు మాకేపాపం తెలియదు అని బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

ఇప్పటికే నయీమ్ తో సంబంధాలపై అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోన్న పేరు మాజీ హోమ్ మంత్రి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పేరే.మాధవరెడ్డి ని ఎవరు,ఎలా చంపారో అందరికి తెలిసిందే.దానికి ప్రతీకారంగానే మాధవరెడ్డి హత్యానంతరం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఉమా మాధవరెడ్డి స్వయంగా తన ఇంట్లోనే నయీమ్ కి ఆశ్రమం కల్పించిందని వార్తలు గుప్పుమంటున్నాయి.నయీమ్ అండతోనే మాధవ రెడ్డి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

అయితే వీటిపై మాధవ రెడ్డి సతీమణి ఉమా మాధవ రెడ్డి,కుమారుడు సందీప్‌రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థి వచ్చింది.తమకే సంబంధం లేదని,అధికార తెరాస పార్టీ సొంత పార్టీ ప్రజా ప్రతినిధులను బయట పడేసేందుకే తమను ఇరికిస్తోందని ఆరోపించారు.మాధవ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన భువగిరి నే నయీమ్ కూడా అడ్డాగా చేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం ఉమా మాధవ రెడ్డి పై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

ఇప్పటికైతే మాధవరెడ్డి ఫామిలీ ప్రెస్ మీట్ పెట్టి మాకే సంబంధం లేదని చెప్పుకుంది.ఇలా ఒక్కొక్కరుగా బయటికి రావడం మొదలు పెడితే లిస్ట్ చాలా పెద్దదే వుంది.డైరీ రాసుకునే అలవాటున్న నయీమ్ అందులో కోడ్ భాష DGP1 ACP2 ఇలా రాయడం తో పెద్ద చిక్కొచ్చి పడింది.విచారణ పారదర్శకంగా పూర్తయితే కానీ నయీమ్ వెనుక ఉండి నడిపిన అసలు సూత్రదారులు బయటికొచ్చే అవకాశం లేదు.