2016లో నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ఇప్పటి వరకు పట్టాలు ఎక్కించలేదు. సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.
ఎన్టీఆర్ 27వ సినిమాగా తన సోదరుడు కళ్యాణ్రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించే సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తోన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్లో సెట్స్మీదకు వెళుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే 29వ సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
సౌత్ ఇండియాలో టాప్ ఇంటిలిజెంట్ డైరెక్టర్లలో ఒకరైన విక్రమ్ కె. కుమార్ చెప్పిన కథకు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం సినిమాతో పాటు నితిన్ ఇష్క్, సూర్యతో 24 వంటి ఇంటిలిజెంట్ మూవీని తెరకెక్కించిన విక్రమ్ చెప్పిన కథ ఎన్టీఆర్ను మెప్పించిందట.
ఎన్టీఆర్ బాబి-త్రివిక్రమ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసేలోగా విక్రమ్, అఖిల్ అక్కినేని హీరోగా సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ వెంటనే వీరి కాంబినేషన్లో తెరకెక్కే ప్రాజెక్టు ఉంటుందని తెలుస్తోంది.