ఈ మధ్య హీరోయిన్స్ వ్యవహార శైలి మరీ వివాదాస్పదం అవుతోంది.సినిమాకి సైన్ చేశామా,సినిమాలో యాక్ట్ చేశామా,డబ్బు తీసుకున్నామా,వారి దారిన వారు వెళ్లిపోయామా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.సినిమా ప్రమోషన్ తో మాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు.కనీసం ఆడియో వేడుకకి కూడా హాజరుకావడం లేదు.
మొన్నామధ్యన రిలీజ్ అయినా త్రిష నటించిన నాయకి సినిమా విషయంలో ఇదే వివాదం తెరపైకి వచ్చింది.చిత్ర నిర్మాత ఇదే విషయమై బాహాటంగానే త్రిషపై విమర్శలు గుప్పించారు.ఇదే దారిలో నడుస్తోంది నయనతార కూడా.స్వయంగా రామానాయుడు లాంటి పెద్దాయన ఓసారి ఆమెను ఉద్దేశించి గట్టిగానే పరోక్ష విమర్శలు గుప్పించారు.‘బాబు బంగారం’ ఆడియో వేడుకకు నయనతార రాకపోవడం హాట్ టాపిక్ అయింది. ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగులో ఆడియో కార్యక్రమాలకు రావడం నయన్కు అలవాటు లేదు.
తెలుగులో పదికి పైగా సినిమాలు చేసిన నయన్.. ఒక్క ‘శ్రీరామరాజ్యం’ ఆడియో వేడుకకు మాత్రమే హాజరైంది.‘శ్రీరామరాజ్యం’ తనకు ప్రత్యేకం కావడంతోనే నయన్ ఈ సినిమా ఆడియో రిలీజ్కు హాజరైందని చెప్పుకుంటారు. తనకున్న గ్లామరస్ ఇమేజ్ ను పట్టించుకోకుండా జీవితంలో గుర్తుండిపోయే సీత పాత్ర ఇచ్చినందుకు బాపు గారికి కృతజ్ఞత చెప్పుకోడానికి ఈ కార్యక్రమానికి నయన్ వచ్చిందని అంటారు.ఏదేమైనా నయన్ను తెలుగు ఆడియో ఫంక్షన్లలో చూసింది బాలయ్య సినిమాకే. మూవీలకు సైన్ చేసేటప్పుడే ఆడియో వేడుకలకు రానని ఈ బ్యూటీ తెగేసి చెప్పేస్తుందట. ‘బాబు బంగారం’ టీంతో ఆమెకు విభేదాలు తలెత్తడంతో ఇక.. ఆడియో వేడుక గురించి ఆమె అసలు పట్టించుకోలేదట.