భారత భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ బుర్హాన్ వనీ.. హీరోలా చూస్తోంది పాకిస్థాన్. ఇండియా ఎంత చెబుతున్నా వినకుండా.. వనీ విషయంలో కలగచేసుకుంటోంది. అతను యువతకి స్ఫూర్తి అంటూ.. ప్రచారం చేస్తోంది. గురువారం ‘ఆజాదీ ఎక్స్ప్రెస్’ పేరుతో ఓ రైలును ప్రారంభిస్తోంది పాకిస్థాన్.
ఈ రైలు బోగీలపై వనీ ఫొటోలను అంటించింది. వనీతోపాటు కాశ్మీర్లో హింస బాధితుల ఫొటోలనూ రైలు బోగీలకు అంటించింది. ఈ రైలును పాక్ రైల్వే మంత్రి ఖాజా సాద్ రఫీ గురువారం ప్రారంభించనున్నారు. ఇది కయ్యానికి కాలుదువ్వే చర్యేనని చెబుతున్నారు