గౌతమి పుత్ర బిజినెస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఐటీ అధికారులు

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కరీర్ లో 100  వ సినిమాగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అదే రేంజ్ లో బాలయ్య కరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు జాతివాడైన శాతవాహనుల వారసుడిగా భారతదేశం మొత్తాన్ని కలిపి ఒకే రాజ్యంగా కలిపి పరిపాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనకు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు శబాష్ అన్నారు.

అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు అసలు లెక్కలు బయటకు రానున్నాయి. సినిమా ఇప్పటివరకు 77 కోట్లరూపాయల బిజినెస్ చేసినట్టు చెపుతున్నారు .  దీంట్లో సాటిలైట్ రైట్స్ కూడా కలిపి ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్నే  డైరెక్టర్ క్రిష్, నిర్మాత జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ ఒకటి రెండురోజుల్లో మీడియాకి తెలియచేయనున్నట్టు సమాచారం.

శాతకర్ణి ఆఫీస్ పై ఐటీ అధికారులు కొన్ని వారలాకింద దాడిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాతలు అకౌంట్స్ అన్నీ కరెక్ట్ గానే చూపించారని, దాంట్లోనే ఈ 77 కోట్లరూపాయల విషయం చూపించినట్టు సమాచారం.