చిరు బాలయ్య మధ్యలో శర్వానంద్!

శర్వానంద్ కి ఇమేజ్ తో సంబంధం లేకుండా ఓ సెపరేట్ క్రేజ్ ఉండి..శర్వానంద్ సినిమా అంటే రొటీన్ గా ఉండదు అన్న ఇమేజ్ ఉంది శర్వానంద్ కి.అదే ధైర్యం తో పోయిన సంక్రాంతి కి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో మూడు స్టార్‌ హీరోల సినిమాలు. వాటికి పోటీగా శర్వానంద్‌ సినిమా ఎక్స్‌ప్రెస్‌ రాజా’ను బరిలోకి దించి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.ముగ్గురు పెద్ద హీరోల సినిమాల మ‌ధ్య ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిన్న సినిమా నలిగిపోతుందేమో అని అంద‌రూ జాలిపడ్డారు. కానీ కంటెంట్‌ ఉన్న సినిమాకు ఎంత పోటీ ఉన్నా పర్వాలేదని ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ నిరూపించింది. పెట్టుబడి మీద మంచి లాభాలు తెచ్చి పెట్టి సూపర్‌ హిట్‌ అనిపించుకుంది. విజ‌య‌ఢంకా మోగించింది.

అయితే ఈ సంక్రాంతికి ఈ పోటీ మరింత తీవ్రంగా వుండబోతోంది.మెగా 150 సినిమా,బాలయ్య 100 వ సినిమా సంక్రాంతికే రాబోతున్నాయి.శర్వానంద్ ఎక్కడా తగ్గడం లేదు.మొన్న సంక్రాంతికి కలిసొచ్చిందని ఈసంక్రాంతికి కూడా అలాగే ట్రై చేస్తున్నాడు.కొడితే పెద్ద హీరోలనే కొట్టాలని పని గట్టుకుని మరీ ఈసారి కూడా అడుగులు వేస్తున్నాడు.యంగ్ హీరో శ‌ర్వానంద్‌కు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మ‌రోసారి పెద్ద హీరోలను ఢీకొట్టడానికి రెడీ అయిపోయాడు. దానిలో భాగంగానే ‘శతమానం భవతి’‌ ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ చేస్తారట. నిర్మాత దిల్‌ రాజు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. ‘బొమ్మరిల్లు’ విడుదలై పదేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా ‘శతమానం భవతి’ విశేషాలు పంచుకున్నాడు రాజు.