టీజర్ తో ట్రీట్ ఇవ్వనున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ బ్రేక్ పడింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ అకీరా రిలీజ్ సందర్భంగా మురుగదాస్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ కావటంలో మహేష్ మూవీకి బ్రేక్ వచ్చింది.

అయితే తన సినిమాలకు ఫస్ట్ లుక్ టీజర్తోనే భారీ హైప్ క్రియేట్ చేసే మురుగదాస్ ఇప్పుడు ప్రత్యేకంగా ఒకరోజు టీజర్ కోసం షూటింగ్ చేయడానికి ప్లాన్చేస్తున్నాడట. బ్రాహ్మోత్సవం సినిమా ప్లాప్ అవటంతో నిరుత్సాహంతో వున్న  అభిమానులకు 50 సెకండ్స్ టీజర్ తో మంచి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు మహేష్.