తమన్నాని కోటి ఇచ్చిమరీ తీసేసారు

మిల్కి బ్యూటీ తమన్నా ఈమధ్యకాలంలో మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. సూపర్ డాన్స్ లతో అదరగొడుతున్న ఈ అమ్మడి స్పెషల్ సాంగ్స్ కి వున్న క్రేజ్ ఇంకా ఏ హెరాయిన్ కి లేదు. అలాగే పారితోషకం విషయంలో కూడా ఈ అమ్మడిదే పై చెయ్యి.

అంతలా క్రేజ్ వున్న ఈ అమ్మడి ని మాజీ ప్రధాని మనువడు అయిన నిఖిల్ హీరోగా తొలిసారి నటిస్తున్న సినిమా జాగువార్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తమన్నాకి కోటి రూపాయల పారితోషకం ఇచ్చిమరీ ఐటెం సాంగ్ చేయించారు. అయితే ఇప్పుడు ఆ అమ్మడి బొమ్మ సినిమా పోస్టర్స్ లో ఎక్కడ కనిపిన్చట్లేదు.

తెలుగు వారికి పరిచయమైన తమన్నా ఫోటోను కోటి రూపాయల పారితోషకం ఇచ్చిమరీ పోస్టర్స్ లోనుంచి తీసివేయటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.