తారక్ లెక్కలు మారాయి

యుంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో వున్నా క్రేజ్ చాలా ఎక్కువ. రీసెంట్ గా రిలీజ్ అయినా జనతా గ్యారేజ్ తో భారీ సక్సెస్ అందుకున్న ఈ హీరో తనలోని ఇంక్కొక్కడిని బయటికి తీసాడనిపిస్తుంది. వరుస డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.

అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడట ఇంతకు ముందులాగా నాలుగు ఫైట్లు, ఆరు పాటలు వుండేటట్టు లెక్కలు వేసుకోకుండా తనలోని నటుడి సత్తాను చూపించే సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు పూరి జగన్నాధ్ తో సినిమా చేయబోతున్నాడనే సమాచారం ఉన్నప్పటికీ ఇంకా ఏదయినా వైవిధ్యమేమున్న కథలకోసం చూస్తున్నాడట.

ఈ క్రమం లోనే వరుస హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడితో ఒక వైవిధ్యమయిన పాత్రలో నటించటానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. అనిల్ రావిపూడి ఇంతకు ముందు పటాస్, సుప్రీం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు. ఈ వరుసలోనే తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి కథ కూడా చేయటానికి ఆసక్తిగా వున్నాడట మన యంగ్ టైగర్.