దక్షణాది 4 రాష్ట్రాలలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ నయనతార అటు గ్లామర్తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్తోనూ అభిమానులను అలరిస్తుంటుంది.. అలాగే విమర్శలుకూడా ఎక్కువగానే ఎదుర్కొంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాదు. ఇటీవలె వెంకటేష్ సరసన ‘బాబూ బంగారం’ సినిమాలో నటించిన నయన్.. ఆ యూనిట్ సభ్యులకు చుక్కలు చూపించిందట. డేట్లు ఇచ్చి కూడా షూటింగ్కు హాజరుకాకుండా ఇబ్బందులు పెట్టిందట.
ఇప్పుడు హైదరాబాద్ స్టార్ హోటల్స్ యజమానులు నయనతార వల్ల ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే నయనతార కి కోపం వస్తే ఎదురుగా ఎవరుంటే వాళ్లపై అరవటం, చుట్టుపక్కల వున్న వస్తువులను పగలకొట్టడం తనకిచ్చిన రూమ్ లోపలి ఇంటీరియర్ ని నాశనం చేయటం వంటివి చేస్తుంటుందట. అయితే తరువాత వాటన్నిటికీ డబ్బు చెల్లిస్తుందట.
ఈమధ్యనే బంజారాహిల్స్ లో ఒక హోటల్ లో అలాగే చేసిందట అలాగే మరికొన్ని హోటల్స్ నుంచికూడా అలాంటి కంప్లయింట్సే రావడంతో వారంతా నయనతారను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.