నాగ్ అవుట్ చిరు ఇన్

హిందీ లో సూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మా టీవీ ప్రోగ్రాం ని హోస్ట్ చేయడా కింగ్ నాగార్జున తొలి రెండు సీసన్స్ లో పలకరించగా ఇక మూడో సీజన్లో కి నా ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడంటూ నాగార్జునే స్వయంగా ప్రకటించాడు.

ఈ నెలాఖరులోనే చిరు ఈ ప్రోగ్రాం కి సంబంధించి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు..అక్టోబర్ లో మిగిలిన ఎపిసోడ్స్ కూడా పూర్తి చేస్తారని సమాచారం.వ్యాఖ్యాతగా చిరు ఎలా వుండబోతున్నారన్నది ఆసక్తి కరంగా మారింది..వెండితెరపై మకుటం లేని మహారాజుల వెలిగిన చిరు బుల్లి తెరపై ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

నాగార్జున పలకరించిన మొదటి రెండు సీసన్స్ బాగా హిట్ అయ్యాయి..ఇక చిరు కేవలం ఈ సీసన్ తోనే ఆపేస్తారా లేక ఇంకో 2-3 సీసన్స్ కంటిన్యూ అవుతారా అన్నది ప్రస్తుతానికి తేలేది కాదు.చిరు షో ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నదే కీలకం అదే కాకుండా అనేకానేక వాణిజ్య పరమైన అంశాలు కూడా చిరు కొనసాగింపుపై కీలకం.ఏది ఏమైనా చిరు నాగ్ ల మధ్య ఎప్పటినుండో మంచి స్నేహం వుంది..అది మా టీవీ లో పెట్టుబడి పెట్టినా..ఈ మధ్యనే సచిన్,నిమ్మగడ్డలతో కలిసి ఓ ఫుట్బాల్ జట్టును కొనుగోలు చేసినా..ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ని షేర్ చేసుకున్నా వీటన్నిటినీ కామన్ పాయింట్ మాత్రం నాగ్ చిరుల స్నేహమే.