పతాక సన్నివేశాల్లో ‘బాబు బంగారం’

కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాబు బంగారంగా వస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక చివర్లో ఆయన పలికిన “అయ్యో అయ్యో అయ్యయ్యో..” డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ హైదరాబాద్ – గచ్చీబౌలీలో సాగుతోంది. వెంకటేశ్, నయనతార, ప్రధాన తారాగణం పాల్గొన్న పతాక సన్నివేశాలను దర్శకుడు మారుతి షూట్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ తో టాకీపార్టు పూర్తవుతుంది.

క్లైమాక్స్ పూర్తైతే ఓ పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. హైదరాబాద్ లోనే సెట్ వేసి ఆ పాట చిత్రీకరణను కూడా త్వరలో పూర్తిచేస్తారని సమాచారం. ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకీ స్టైల్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన స్వరపరిచిన బాణీలు అదరహో అని అంటున్నారు. బాబు బంగారం పాటలను వచ్చేనెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ కీ .. ఫస్టు టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటే, సినిమా సగం విజయవంతమైనట్టేనని చిత్రబృందం అంటోంది. జూలై నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నారు.