పవన్ బెంజ్ కార్ అందుకే అమ్మేశాడా!

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గురించిన వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆయన తన బెంజ్‌ కార్ అమ్మేశారని చెప్పుకుంటున్నారు. తన దగ్గర ఉండే మెర్సిడెస్ బెంజ్ జి55 మోడల్‌ను పవన్ అమ్మినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కారు మోడల్‌ను ఎప్పుడో నిలిపివేసింది బెంజ్ కంపెనీ. అప్పట్లో రూ.1.5 నుంచి రూ.2 కోట్లు ధర ఉన్న ఈ కారు ఇప్పుడు అమ్మితే రూ.80లక్షలు కూడా రాకపోవచ్చని వినికిడి. కాకపోతే పవన్ వాడారు కాబట్టి రూ.1 కోటి వరకు చేతికంది ఉండొచ్చు.

అసలు పవన్ ఈ కార్‌ ఎందుకు అమ్మేశారో తెలీడంలేదు. ఆర్ధిక సమస్యలున్నాయని గతంలో పలుమార్లు చెప్పినా.. కార్లు అమ్ముకునేంతటి పరిస్థితైతే ఆయనకు లేదు. దీంతో పవర్‌స్టార్ కొత్త కారు కొనుక్కోవడానికి పాత వాహనం అమ్మి ఉండొచ్చని కొందరు అంటున్నారు.