‘సుప్రీమ్’తో మంచి మార్కులు కొట్టేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘తిక్క’తో బిజీగా ఉన్న ఈ యువహీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మల్టీస్టారర్కు సంతకం చేశాడు. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిన పాత్ర ఇదట. గౌతమ్ ముందుగా అర్జున్నే కాంటాక్ట్ చేశాడని.. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. అర్జున్ కాదన్నా.. ఆయన బంధువే అయిన సాయికి కథ వినిపించగా వెంటనే ఓకే చేసేశాడని అంటున్నారు.
గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్లో సాయి ధరమ్ తేజ్తో పాటూ కోలీవుడ్కు చెందిన జయం రవి, మాలీవుడ్ నుంచి పృథ్విరాజ్, శాండల్వుడ్ నుంచి పునీత్ రాజ్కుమార్లు నటిస్తున్నారు. హీరోయిన్స్గా అనుష్క, తమన్నా ఇప్పటికే ఎంపికయ్యారు. ఏదేమైనా బన్నీ తిరస్కరించిన మూవీ సాయి ఖాతాలో చేరింది. మొత్తానికి ఈ సినిమా ఛాన్స్ మెగా కుటుంబం గడప దాటలేదు.