మెగా, నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలకు గిరాకి భలే ఉంది.వన్సపాన్ ఎ టైమ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చున్న తర్వాత మల్టీ స్టారర్ చిత్రాల్లో చేయలంటే ఇబ్బంది పడేవారు. మరి ఆ రోజుల్లో అగ్రనటులంతా మల్టిస్టారర్ చిత్రాలు చేసినవారే.ఆ ట్రెండ్ ఇపుడు తెలుగులోను ఎక్కువువుతుంది.తాజా పరిస్థితి చూస్తే ఈవిషయం మనకు భాగా అర్ధమవుతుంది.

టాలీవుడ్లో మల్టీస్టారర్ ఫీవర్ మళ్లీ మొదలైందా అనిపిస్తుంది. గత కొంతకాలంగా వస్తోన్న సినిమాలను చూస్తుంటే ఇది మనకు భాగా తెలుస్తోంది.మరి ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వారు గుండమ్మ కథ, మాయాబజార్ ఇలా కొన్నిఅద్భుతమైన చిత్రాల్లో నటించి షెభాష్ అనిపించుకున్నారు. తర్వాత కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు కొన్ని సినిమాల్లో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించారు. ఇలా కొన్ని క్రేజీ కాంబినేషన్ వస్తే చూసే ప్రేక్షకులు కూడా ఎంతో థ్రీల్ గా ఫీల్ అవుతుంటారు. తమ అభిమాన హీరోలు ఇద్దరూ ఒకే తెరపై కనిపించడం అంటే సఘటు ప్రేక్షకులకు ఆనందకరమైన విషయమే. అయితే ఈ మద్య కాలంలో మాత్రం స్టార్ హోదాలో ఉన్న ఇద్దరు హీరోలు ఒకే తెరపై మాత్రం కనిపించలేదు. ఆ మద్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించారు.

గోపాల గోపాల చిత్రంలో వెంకీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోనూ నటించారు. ఈ మద్య స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి సుముఖత చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు గొప్ప క్రేజీ కాంబినేషన్ రాబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న ఫ్యామిలీస్ లో ఇటు నందమూరి, అటు కొణిదెల కుటుంబాలు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇటు వెండితెరపై అటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఇప్పుడు నందమూరి, మెగాస్టార్ ఫ్యామిలీ చిత్రాలు పోటా పోటీగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ రెండు ఫ్యామిలీలు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. ఆ ఆలోచనే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది కదూ. కానీ అది నిజం కాబోతోంది. మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల హీరోలతో ఓ మల్టీస్టారర్ రాబోతోంది.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యువహీరోలుగా సత్తా చాటుతున్న సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ రామ్ హీరోలుగా ఏ.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతోందని టాక్. కేఎస్ రామారావు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ లో ఈ క్రేజీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోందట. మెగా, నందమూరి ఫ్యామిలీల సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే మరి.