రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

మాస్ మహారాజా రవితేజ సినిమా వచ్చి చాలా రోజులయ్యింది. ఏడాదికి 3 , 4 సినిమాలు తీసే రవితేజ ఈ సరి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య సిక్ ప్యాక్ చేసిన లూక్ ఒకటి బయటికి ఒచ్చింది కానీ ఆ లుక్ అభిమానుల ను అంతగా ఆకట్టుకోలేదు. బహుశా మళ్ళీ రెగ్యులర్ లూక్ వచ్చేవరకు వెయిట్ చేసినట్టున్నాడు మాస్ మహారాజ్.

రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలు చేయవలసి వుంది. అయితే వాటిలో ఒకటి ఆగిపోగా, మరొకటి సెట్స్ పైకి వెళ్లడానికి లేట్‌ అవుతోంది. దాంతో ఆయన్నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాదేమోనని అభిమానులు నిరాశ చెందారు. అయితే.. ఫ్యాన్స్ నిరాశకు చెక్‌ పడే న్యూస్‌ ఒకటి ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

విక్రమ్ సిరి అనే డైరక్టర్‌తో రవితేజ చేయనున్న చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వక్కంతం వంశీ సిద్ధం చేసిన కథకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది లేటెస్ట్ సమాచారం. ఈ సినిమాకి రవివర్మ దర్శకుడిగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో రవితేజ ఉన్నాడట