రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టుపై క్లారిటీ

ఐదు సంవ‌త్స‌రాల పాటు ఆ డైరెక్ట‌ర్ మ‌దిలో ఒకే ఒక ఆలోచ‌న‌… రెండో ఆలోచ‌న లేదు. ఆయ‌న నిద్ర‌పోయినా, మేల్కొన్నా బాహుబ‌లి గురించే ఆలోచ‌నంతా..అంత క‌ష్టానికి ఫ‌లితం బాహుబ‌లి రూపంలో అదిరిపోయే విజ‌యం ద‌క్కింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌డిన క‌ష్టానికి బాహుబ‌లి సినిమా తెలుగు సినీ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.

బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు కంటిన్యూగా తెర‌కెక్కిన బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ మూవీ ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రెస్టేజియ‌స్ మూవీ త‌ర్వాత రాజ‌మౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి ?  రాజ‌మౌళి మ‌హేష్‌బాబుతో సినిమా చేస్తాడా ?  గ‌రుడ చేస్తాడా ? త‌న డ్రీమ్ ప్రాజెక్టు అయిన మ‌హాభార‌తం చేస్తాడా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోను నెల‌కొంది.

అయితే బాహుబ‌లి 2 త‌ర్వాత త‌న నెక్ట్స్ ప్రాజెక్టుపై రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చేశాడు. త‌న డ్రీమ్ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్టు చెప్పేశాడు. బాహుబలి-2 రిలీజ్ తర్వాత ఓ 6 నెలలు గ్యాప్ ఇచ్చేసి.. ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతాన్ని పట్టాలెక్కిస్తానని చెప్పాడు. ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాజ‌మౌళి మాట్లాడుతూ బాహుబ‌లి 2 త‌ర్వాత ఆరు నెల‌లు గ్యాప్ తీసుకుని 2017 చివ‌రి నుంచి మ‌హాభార‌తం సినిమా ప‌నులు ప్రారంభిస్తాన‌ని చెప్పాడు.

తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమకు చెందిన స్టార్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తాడట. బాహుబ‌లి కోస‌మే ఐదు సంవ‌త్స‌రాల టైం తీసుకున్న రాజ‌మౌళి…మ‌హాభార‌తాన్ని ఎన్ని సంవ‌త్స‌రాల్లో నిర్మిస్తాడో ?  ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.