రాయుడు విజయంతో పవన్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్

కాటమరాయుడు సునామితో ఒక పక్క పవన్ బాక్స్ ఆఫీసునీ షేక్ చేస్తుంటే, పవన్ తర్వాత చేయబోయే బడా ప్రాజెక్టుకి త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతున్నాడని సమాచారం. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకొనే పవన్ ఇప్పుడు ఈ సినిమాని శర వేగంగా పట్టాలెక్కించడానికి సన్నద్ధమయ్యారట. అప్పుడే ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ఈ రోజు నుంచి రామోజీ ఫీల్మ్ సిటీ లో ఫైట్ మాస్టర్ విజయన్‌ పర్యవేక్షణలో బారి ఎత్తున్న ఫైట్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారట.

ఏది ఏమైనా ఈ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ కేవలం నాలుగు నెలల్లో పూర్తి చెయ్యాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడని సమాచారం. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా అభిమానుల్ని అలరించబోతున్నాడట, పవన్ సరసన కీర్తి సురేష్ కనువిందు చేయనుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే త్రివిక్రమ్ ఈ సినిమాని బతుకమ్మ పండుగ బరిలో ఉంచుతాడట.

ఆల్రెడీ పవన్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి, అత్తారింటికి దారేది అయితే ఏకంగా 100 కోట్ల క్లబ్ లూకి చేరిపోయింది మరి ఇప్పుడే పట్టాలెక్కుతున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ మరిన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తదో చూదాం.