రిలీజ్ టైం కి రజిని రావడం పక్కా

రజిని అభిమానులకి శుభవార్త .ఆరోగ్య పరీక్షల నిమిత్తమే కాక.. కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్ అమెరికా వెళ్లారు. ఆయన స్వదేశానికి ఎప్పుడు వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌. రజనీ ఈ నెల మొదటి వారంలోనే యూఎస్‌ నుంచి చెన్నై వచ్చేస్తున్నారు. ‘కబాలి’ విడుదలకు ఆయన ఇక్కడే ఉంటారు.

ఇక.. మూడో వారం నుంచే తలైవా శంకర్ గ్రాండ్ ప్రాజెక్ట్‌ ‘రోబో 2.0’ షూటింగ్‌లో పాల్గొంటారు. రజనీతో పాటూ ఆయన కుమార్తెల్లో ఒకరు రోజూ సెట్స్‌కు వస్తారు. ఆరోగ్య కారణాల దృష్ట్యానే ఆయన్ను కనిపెట్టుకుని ఉండేందుకు ఐశ్వర్య లేదా సౌందర్యల్లో ఒకరు షూటింగ్ స్పాట్‌లో ఉండబోతున్నారని సమాచారం.

రూ.350కోట్లతో తెరకెక్కుతున్న ‘రోబో 2.0’లో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్‌లు లీడ్‌ రోల్స్ పోషిస్తున్నారు. 3డీ టెక్నాలజీని వినియోగిస్తూ ఈ సై-ఫై ఎంటర్‌టైనర్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు దర్శకుడు శంకర్.