రేసుగుర్రం లా రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమా ని డిసెంబర్ నాటికి రిలీజ్ చేయటానికి సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా సినిమాకి సినిమాకి చాల గ్యాప్ తీసుకుంటూ వచ్చిన ఈ మెగా హీరో ఇకనుంచి వరుస సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. వరుస క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేయటానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ధ్రువ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమాకి సన్నాహాలు జరిగిపోతున్నాయి.

దాని తరువాత త్రివిక్రమ్, కొరటాల శివ డైరెక్షన్లలో సినిమాలు చేయటానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా క్లాస్ డైరెక్టర్ మణిరత్నంతో కూడా సినిమా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందే చరణ్, బన్నీ మల్టీ స్టారర్  గా ఒక సినిమాని ప్లాన్ చేసాడు మణిరత్నం అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు మణిరత్నం చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చడంతో మణిరత్నం రాంచరణ్ క్రేజీ కంబినేషన్లో సినిమాకి సిద్ధమవుతున్నారని టాలీవుడ్ సమాచారం.

ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో రేసుగుర్రంలా పరిగెత్తటానికి సిద్ధమయిన రాంచరణ్ డెసిషన్ తో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.