గత కొన్నాళ్లుగా కలెక్షన్ కింగ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టే కనిపిస్తోంది! పోలిటికల్గా తాను పెద్దగా ప్రత్యక్ష రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా.. తన కూతురు మంచు లక్ష్మిని రంగంలోకి దింపాలని మోహన్ బాబు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేతను అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక వంకతో ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు కూతురిని వెంటబెట్టుకుని మరీ కలిశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జనవరి 1న కూడా చంద్రబాబు తన స్వగ్రామం నారా వారి పల్లెకు వెళ్లిన సందర్భంలోనూ వదిలి పెట్ట బొమ్మాళీ తరహాలో మోహన్బాబు వెళ్లి కలిశారు.
దీంతో చంద్రబాబు సైతం ప్రస్తుత పాలిటిక్స్లో మంచు లక్ష్మిని ఎలా వినియోగించుకోవాలనే వ్యూహంపై కసరత్తు జరిపి పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే 2019 ఎన్నికల్లో మంచు లక్ష్మికి నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఇవ్వనున్నారని సమాచారం. దీనివల్ల ఇటు మోహన్బాబు అభీష్టంతోపాటు.. చంద్రబాబు కోరిక కూడా తీరనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నగరి నియోజకవర్గం నుంచి వైకాపా ఫైర్ బ్రాండ్ రోజా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై విరుచుకుపడడం ద్వారా ఏడాది పాటు సస్పెన్షన్కు ఆమె గురైంది.
ఇదేవిధంగా టీడీపీ తరఫున కూడా ఓ ఫైర్ బ్రాండ్ ఉంటే బాగుంటుందని చంద్రబాబు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ క్రమంలోఆయనకు మంచు లక్ష్మి ప్రతిపాదన నచ్చిందని తెలుస్తోంది. ఈమెకు టికెట్ ఇవ్వడం ద్వారా వైకాపా ఎమ్మెల్యే రోజాకు నేరుగా షాక్ ఇవ్వవచ్చని బాబు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో మోహన్బాబు కోరిక మేరకు మంచు లక్ష్మికి 2016లో అసెంబ్లీ సీటు కేటాయించాలని టీడీపీ అధినేత డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. వైకాపాకు మరో పోటీ నేత రెడీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.