తెలుగమ్మాయిలకి టాలీవుడ్లో ఆదరణ తక్కువ అన్న సంగతి తెలిసిందే. కానీ మన ముద్దుగుమ్మలకి కోలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తూ ఉంటుంది. అక్కడ తెలుగమ్మాయిలకు టాప్ రేంజ్లో అవకాశాలు ఉంటాయి. అలా సక్సెస్ అయిన వాళ్లే అంజలి, బిందుమాధవి, స్వాతి, శ్రీ దివ్య తదితర ముద్దుగుమ్మలు. టాలెంట్, అందం అన్నింటిలోనూ ఈ ముద్దుగుమ్మలు అదుర్స్. అయితే తాజాగా ముద్దుగుమ్మ శ్రీ దివ్యకు కోలీవుడ్ నుండి షాకుల మీద షాకులు తగులుతున్నాయట. ఇంత వరకూ ఆమెకు కోలీవుడ్లో వరుస అవకాశాలే. చేతి నిండా సినిమాలే. అయితే తాజాగా పరిస్థితి రివర్స్ అయ్యింది. అక్కడ ఈ మధ్య ఈ భామకు అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే వస్తున్నాయట.
కార్తీతో చేసే ‘కాష్మోరా’ అనే సినిమాలో సీనియర్ నటి నయనతార నటిస్తోంది. నయన శ్రీదివ్యను డామినేట్ చేస్తుందేమో అని భయపడ్తుందట. హారర్ జోన్లో వస్తోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్కి కూడా చోటుందట. అంటే శ్రీదివ్య పాపం ఈ ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్గా మాత్రమే నటిస్తోంది. ఇలా చేయడం వల్ల తన ఇమేజ్కు డామేజ్ ఏర్పడుతుందేమో అని భావిస్తోందట. దాంతో శ్రీదివ్య సెకండ్ హీరోయిన్గా చెయ్యనని చెప్పేస్తోందట. నేచురల్ లుక్స్లతో ఆకట్టుకునే ఈ అందాల భామ, అందాల ఆరబోతకు మాత్రం ససేమిరా అంటోంది. అయినా అక్కడ అవకాశాలు బాగానే వరిస్తున్నాయి అమ్మడిని. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ దృష్టి ఇప్పుడు బాలీవుడ్పై కూడా పడిందని టాక్ వినిపిస్తోంది. కానీ ఎక్స్పోజింగ్కి దూరం అంటే బాలీవుడ్ దగ్గర చేస్తుందా. శ్రీ దివ్య బాలీవుడ్ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలిక.