సినిమా షూటింగ్ నిలిపివేయాలంటూ రచ్చ రచ్చ చేసారు

ఏ ముహూర్తాన సంజయ్ లీల భన్సాలీ పద్మావతి సినిమా మొదలు పెట్టాడో కానీ అడుగడుగునా సినిమాకి ఇబ్బందులు తలెత్తుతూనే వున్నాయి.ఇబ్బందులంటే అదేదో షూటింగ్ ని అడ్డుకోవడం లాంటివి అయితే పర్లేదు.ఈ సినిమాకష్ఠాలు నిజంగా సినిమా కష్టాలే.ఏకంగా దాడులే జరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది.

ఆ మధ్యన పద్మావతి షూటింగ్ జైపూర్ లో జరుగుతుండగా కొంత మంది దుండగులు చిత్ర దర్శకుడు బన్సాలి పై భౌతిక దాడికి తెగబడ్డారు.ఈ ఘటనతో బాలీవుడ్ అంత ఒక్క సారిగా ఉలిక్కి పడింది.అన్ని వర్గాల వారూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.ఆ తరువాత ఎక్కడ అవుట్ డోర్ షూటింగ్ జరిగినా భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయితే తాజాగా మంగళవారం అర్ద రాత్రి సుమారు 10 : 30 సమయంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మంది దుండగులు సినిమా సెట్స్ పై దాడి చేశారు.దాడి అంటే అదేదో రాళ్ల దాడి అనుకునేరు.ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి సెట్స్ అన్ని తగలబెట్టేశారు.సెట్స్ తో పాటు షూటింగ్ సామాగ్రి మొత్తం ఈ దాడిలో బూడిదయిపోయింది. కొద్దీ పాటి సెక్యూరిటీ వున్నా నలభైమంది ఓ వైపు రాళ్లు మరో వైపు పెట్రోల్ బాంబులు రువ్వుతుంటే చూస్తుండడం మినహా చేయగలిగిందేమీ లేకపోయింది.

ఇంతకీ ఈ దాడుల వెనుక ఎవరున్నారనేది ఇప్పటికి తెలియడంలేదు.తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే ఈ పద్మావతిలో ఏవో కొన్ని వర్గాలల్ని కించపరిచే సన్నివేశాలున్నాయని ఈ దాడులు జరుగుతున్నాయని ఒక వర్గం వారి వాదన.అసలు సినిమా రిలీజ్ కాదు కదా కనీసం షూటింగ్ కూడా పూర్తవలేదు అప్పుడే కించపరిచే సన్నివేశాలున్నాయంటూ దాడులా??అదీ మరీ ఇంత భయానకమైన దాడులా..దీనిపై లోతైన విచారణ జరిపితే గాని ఈ దాడుల వెనుక కించపరిచే సన్నివేశాలా వేరే ఏవైనా కారణాల అన్నది బయటపడుతుంది.ఇంతకీ ఈ సినిమాలో పద్మావతి పాత్ర దారి ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె.