స్టార్ హీరోయిన్ డ్రగ్స్ ఆపై సన్యాసం

ఒకప్పుడు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హాట్ హీరోయిన్ మమతా కులకర్ణి గుర్తుందా..? 1992 నుంచి 2002 వరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన మమతా కులకర్ణి సడన్ గా తెరమరుగైంది. ఐతే డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన లైఫ్ మమతా కులకర్ణి కామెంట్ చేసింది.

ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ విక్కీ గోస్వామితో మమత కులకర్ణి సహజీవనం చేస్తోంది.ఆమె కూడా స్మగ్లర్ గా మారిందని ఇటీవల ముంబై పోలీసులు హంటింగ్ మొదలు పెట్టారు.ఈ నేపథ్యంలో మమతా స్పందించింది. తనకు ముంబై డ్రగ్స్ మాఫియాతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. తన ఆత్మకథ చదవితే స్టోరీ అర్ధమవుతుందని తెలిపింది. ప్రస్తుతం తాను యోగినిగా మారినట్లు చెప్పింది.

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్నప్పుడే తనకు ఈ ఫీల్డ్ సరిపడదని అర్ధమైందని చెప్పిన మమతా కులకర్ణి..విక్కీ గోస్వామి తనకు ఫ్రెండ్ అని అతనితో కొన్నాళ్లు సహజీవనం చేశానని తెలిపింది. అయితే వరల్డ్ టూర్ పేరుతో తనను తీసుకెళ్లాడని..అతని గురించి తెలియడంతో విడిపోయానని పేర్కొంది. ప్రస్తుతం తాను కెన్యా రాజధాని నైరోబిలోని ఆపార్ట్ మెంట్ లో ఉంటున్నానంది. యోగా,ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక దీక్షలో జీవితాన్ని గడుపుతున్నానంది. కాపాలిలోని శ్రీ గగన్ గిరి మహారాజ్ గురువు దగ్గర దీక్ష తీసుకొని యోగినిగా మారినట్లు వెల్లడించింది.
చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న మమతా కులకర్ణి సడన్ గా బయటికి వచ్చి తన వివరాలు వెల్లడించింది.ఈ గనక విక్కీ గోస్వామి గురించి ఇన్ఫర్మెషన్ ఇస్తుందేమోనని ముంబై పోలీసులు ట్రై చేస్తున్నారు.