చైతు ఎఫెక్ట్‌: టాలీవుడ్‌లో జోరుగా గుస‌గుస‌లు

త‌న కుమారుడు నాగ‌చైత‌న్య‌కు త‌గిలిన దెబ్బ‌తో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చాడ‌ట‌. ఇప్పుడు ఇదే విష‌యంలో టాలీవుడ్‌లో జోరుగా ట్రెండ్ అవుతోంది. గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున‌. ఆ సినిమా ఏకంగా రూ.55 కోట్ల షేర్ రాబ‌ట్టి నాగార్జున స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చెప్పింది.

సోగ్గాడు హిట్ త‌ర్వాత నాగార్జున ఈ సినిమా డైరెక్ట‌ర్ కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ‌కు సోగ్గాడు చిన్ని నాయ‌నా సీక్వెల్‌కు ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పిన వార్త‌లు వ‌చ్చాయి. సోగ్గాడుకు సీక్వెల్‌గా బంగార్రాజు సినిమా తెర‌కెక్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. బంగార్రాజు  టైటిల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగ్ రిజిస్ట‌ర్ చేయించాడు.

అయితే ఇప్పుడు బంగార్రాజు ప్రాజెక్టు అట‌కెక్కిన‌ట్టే అని తెలుస్తోంది. సోగ్గాడు త‌ర్వాత క‌ళ్యాణ్‌కృష్ణ నాగ‌చైత‌న్య‌తో రారండోయ్ వేడుక చూద్దాం తెర‌కెక్కించాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. సినిమా రొటీన్ టేకింగ్‌తో ఉంద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

రారండోయ్ వేడుక చూద్దాం రిజ‌ల్ట్‌పై నాగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడ‌ట‌. మంచి లైన్.. పేరు మోసిన ఆర్టిస్ట్‌లు.. ఫ్రీడమ్ ఇచ్చినా కళ్యాణ్ యూజ్ చేసుకోలేద‌ని నాగ్ భావిస్తున్నాడ‌ట‌. దీంతోనే మ‌రోసారి క‌ళ్యాణ్‌కు ఛాన్స్ ఇచ్చే సాహ‌సం చేయ‌లేన‌ని నాగ్ అన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.