సినిమా ఎన్ని రోజులు తీసినా.. అందుకు తగిన ప్రచారం కల్పించకపోతే ఆ ప్రభావం సినిమా రిజల్ట్పై స్పష్టంగా కనిపిం చే రోజులివి. మార్కెటింగ్ చుట్టూనే సినిమా అంతా తిరుగుతున్న ఈ సమయంలో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వీలైనంతగా ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. అల్లు అర్జున్, పూజా హెగ్దే కాంబినేషన్లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం `డీజే`. ఈ చిత్ర రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ నిర్మాతలకు టెన్షన్ మొదలవుతోందట. ముఖ్యంగా పబ్లిసిటీ విషయంలో బతిమిలాడుతున్నా.. బన్నీ ససేమిరా అంటుండటంతో నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుకు మరింత ఎక్కవవుతోందట. దీనంతటికీ కారణం ఒక పత్రిక అని తెలుస్తోంది.
డీజే విడుదలకు రెడీ అయిపోయింది. ఆడియో ఫంక్షన్ తప్ప.. పబ్లిసిటీ మొదలవ్వలేదు. సాధారణంగా పబ్లిసిటీ విషయంలో కేర్ తీసుకొనే అల్లు అర్జున్… ఆ దిశగా ఇంకా దృష్టి సారించకపోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. `ఈసారి మీడియా ఇంటర్వ్యూలు తగ్గిద్దాం` అంటున్నాడట. దానికి కారణం… ‘చెప్పను బ్రదర్’ ఉదంతమే. సరైనోడు సక్సెస్ తరవాత ఓ ప్రధాన తెలుగు దిన పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు బన్నీ. అందులో మరోసారి పవన్ కల్యాణ్పై ప్రశ్నకు స్పందిస్తూ… ‘చెప్పను బ్రదర్’ అనేశాడు. దాంతో పవన్ ఫ్యాన్స్ లో మళ్లీ కలకలం రేగింది.
అప్పట్నుంచి దిన పత్రికల ఇంటర్వ్యూ లంటే బన్నీఇబ్బంది పడుతున్నాడట . అతడి ఆలోచనలు చూస్తుంటే ఈసారి మీడియాకు, అందులోనూ దిన పత్రికలకు కాస్త దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిల్మ్నగర్ వర్గాల్లో కొంత చర్చ మొదలైంది. బన్నీని కాస్త కూల్ చేసి… ఇంటర్వ్యూలకు ఒప్పించాలని దిల్రాజు పీఆర్వోలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని రెండు ఏరియాల్లో గీతా ఆర్ట్స్ సొంతంగా విడుదల చేస్తోంది. ఆ రకంగా బన్నీ సొంత సినిమా ఇది. ఆ కారణం చూపించైనా.. బన్నీని పబ్లిసిటీ కోసం ఒప్పించాలని దిల్రాజు ప్రయత్నిస్తున్నారట.
గతంలో రెండు సార్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులపై బన్నీ ఫైర్ అయిన విషయం తెలిసిందే! చెప్పను బ్రదర్ అంటూ బన్నీ అనడం, తర్వాత మరో మెగా హీరో సాయిధరమ్తేజ.. ఆపను బ్రదర్ అంటూ అనడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. దీనిపై తర్వాత అల్లుఅర్జున్.. వివరణ ఇచ్చినా పవర్ స్టార్ అభిమానులు మాత్రం గుర్రుగానే ఉన్నారు.