ప‌టాస్ ర‌వికి షాక్‌…శ్రీముఖికి జోడీగా కొత్త యాంక‌ర్‌..!

బుల్లితెర మీద యాంక‌ర్ ర‌వి అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ర‌వి ఎంత‌లా పాపుల‌ర్ అయ్యాడో కాంట్ర‌వర్సీల‌కు అంతే కేరాఫ్ అడ్ర‌స్ అయ్యాడు. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుక‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌లిరావు అమ్మాయిలు ప‌క్క‌లోకి ప‌నికివ‌స్తార‌ని చేసిన వ్యాఖ్య‌లు టోట‌ల్ ఇండ‌స్ట్రీలోనే పెద్ద దుమారం రేపాయి.

చ‌ల‌ప‌తి వ్యాఖ్య‌ల‌కు ర‌వి సూప‌ర్ అన‌డం కూడా పెద్ద కాంట్ర‌వ‌ర్సీకి దారితీసింది. మ‌హిళా సంఘాలు దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో పాటు చ‌ల‌ప‌తిరావుతో పాటు ర‌విపై జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు పెట్టారు. ర‌విని మ‌హిళా సంఘాలు గ‌ట్టిగా టార్గెట్ చేయ‌డంతో మ‌నోడు పొంత‌న లేని వివ‌ర‌ణ ఇచ్చి ఎస్కేపింగ్‌కు ప్లాన్ చేశాడు. చ‌ల‌ప‌తిరావు గారు చేసిన కామెంట్లు త‌న‌కు విన‌ప‌డ‌లేద‌ని..తాను యాంక‌ర్‌గా కార్య‌క్ర‌మాన్ని ముందుకు న‌డిపించేలా సూప‌ర్ అన్నాన‌ని చెప్పుకొచ్చాడు. అయినా మ‌హిళా సంఘాలు వెన‌క్కి త‌గ్గ‌లేద‌నుకోండి.

ఇదిలా ఉంటే లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ప‌టాస్ షో నుంచి ర‌విని తొల‌గించార‌ని వార్తలు వ‌స్తున్నాయి. మ‌ల్లెమాల ప్రొడ‌క్ష‌న్‌లో ఏ కార్య‌క్ర‌మానికి కూడా ర‌విని తీసుకోకూడ‌ద‌ని వాళ్లు డిసైడ్ అయ్యార‌ట‌. ర‌వి యాంక‌రింగ్ బాగానే చేస్తున్నా వ‌ల్గ‌ర్ డైలాగ్స్ ఎక్కువ‌వ్వ‌డంతో యువ‌త‌ను ఈ షో ప‌క్క‌దారి ప‌ట్టించేలా ఉంద‌న్న విమ‌ర్శ‌లు బాగా ఎక్కువ‌య్యాయి.

ఇటీవ‌ల ర‌విపై మ‌హిళా సంఘాలు కేసులు పెడుతుండ‌డం, ప‌టాస్‌కు ప‌దే ప‌దే అంత‌రాయం క‌లుగుతుండ‌డంతో ఈ షోనుంచి ర‌విని త‌ప్పించిన‌ట్టు టాక్‌. ఈ షోలో శ్రీముఖికి జోడీగా కొత్త యాంక‌ర్‌గా సుడిగాలి సుధీర్‌ను తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఏదేమైనా ఈ వార్త నిజ‌మైతే ర‌వికి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టే..!