బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కొత్తచిత్రం పైసా వసూల్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది సంక్రాంతికి శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మరోసారి పైసా వసూల్గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న బాలయ్య తన తండ్రి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ బయోపిక్లో కూడా నటిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్పై ప్రకటన చేసినప్పటి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ ఆసక్తి నెలకొంది.
ఈ ప్రాజెక్టుకు వర్మ డైరెక్టరా ? లేదా ? ఇంకెవరైనా డైరెక్ట్ చేస్తారా ? అని కూడా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇక పైసా వసూల్ ప్రమోషన్లలో బాలయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు రోజుల్లోనే ఈ బయోపిక్కు డైరెక్టర్ ఎవరన్నది ప్రకటిస్తాం… ఆ వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని బాలయ్య చెప్పారు.
ప్రస్తుతం నాన్నగారి సన్నిహితులను, బంధువులను కలిసి వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని బాలయ్య తెలిపారు. ఏదేమైనా బాలయ్య ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఎక్కడా లేని ఫుల్ జోష్ వచ్చేసింది.