తెలుగుజాతి గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దివంగత ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మించే బయోపిక్పై బాలయ్య అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఈ బయోపిక్ వార్తల్లోకి వచ్చినప్పటి నుంచి సంచలనాలు రేపుతోంది. ఓ వైపు బాలయ్య బయోపిక్, మరోవైపు బయోపిక్లు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అయిన కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు టాలీవుడ్లో హాట్ హాట్గా ప్రకంపనలు రేపుతున్నాయి.
వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్రను లక్ష్మీపార్వతి కోణంలో తీస్తానని చెప్పడంతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా ఎనౌన్స్ చేసేశాడు. దీంతో బాలయ్య బయోపిక్ ఎలా ఉంటుంది ? ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు ? ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ఉత్కంఠగా ఉంది. అయితే దర్శకుడు తేజ ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశాడు. తేజ తన ఫేస్బుక్ ద్వారా ‘ఎన్టీఆర్ బయోపిక్’ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుందని చెబుతూ పోస్ట్ పెట్టారు.
టాలీవుడ్లో ఒకప్పుడు మంచి హిట్లు ఇచ్చి 10-12 ఏళ్లుగా ఎన్నో ప్లాపులు ఇచ్చిన తేజ ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విజయంతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు తేజయే ఎన్టీఆర్ బయోపిక్ను డైరెక్ట్ చేస్తాడన్నది ఆయన పోస్ట్ ద్వారా దాదాపు కన్ఫార్మ్ అయ్యింది. ఈ సినిమా స్క్రిఫ్ట్పై ఇప్పటికే బాలయ్య-తేజ మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది.
అటు తేజ గురువు రాంగోపాల్వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్రను లక్ష్మీపార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కిస్తుంటే ఇటు శిష్యుడు తేజ బాలయ్య హీరోగా మరో బయోపిక్ తీస్తున్నాడు. ఇలా గురుశిష్యులు ఇద్దరూ ఎన్టీఆర్ బయోపిక్లు తీస్తూ పోటీపడుతున్నారు. ఇక ఈ సినిమాకు సాయి కొర్రపాటి, సిసిఎల్ విష్ణు, బాలయ్య నిర్మాతలుగా వుంటున్నారు. బాలయ్య బ్యానర్ పేరు ఇంకా ఫిక్స్ కాలేదు. ఇక తేజకు నామినల్ రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో షేర్ ఫిక్స్ చేశారట.
ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడిగా కన్ఫార్మ్ కాగా మిగిలిన టెక్నీషియన్లు ఈ నెలాఖరులో ఎంపిక కానున్నారు. సినిమా ఎన్టీఆర్ బాల్యం నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ ఆటుపోట్లు, సినిమాలు, రాజకీయాలు, సీఎం అవ్వడం, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, తిరిగి ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ 1985లో సీఎం అవ్వడంతో సినిమా ముగుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఎవ్వరూ ఊహించని విధంగా తేజకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి అందరికి షాక్ ఇచ్చారు.