బాల‌య్యా ఇదేం జోర‌య్యా… లైన్లో మ‌రో రెండు సినిమాలు 

ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో 100 సినిమాలు పూర్తి చేసిన నటుడు బాలకృష్ణ తర్వాత వేగం పెంచాడు. ఆ వెంట‌నే నాలుగైదు నెల‌ల గ్యాప్‌లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ సినిమా చేశాడు. ఆ వెంట‌నే జెట్ స్పీడ్‌తో కోలీవుడ్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ర్ణ (వ‌ర్కింగ్ టైటిల్‌) సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌ర్ణ సినిమాను సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి దింపేందుకు రెడీ అవుతున్నాడు.

క‌ర్ణ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య వెంట‌నే ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ ప్రారంభించేయ‌నున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ జ‌యంతి కానుక‌గా మే 28న రిలీజ్ చేయ‌నున్నారు. తేజ అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసి స్క్రిఫ్ట్ వ‌ర్క్‌, కాస్టింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే సంక్రాంతికి వ‌స్తోన్న క‌ర్ణ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 60 శాతంకు పైగా కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కొన్ని సెంటిమెంట్లు క‌లిసొచ్చేలా ఉన్నాయి. బాలకృష్ణ హీరోయిన్ గా నయనతార కనిపించడం ఇది ముచ్చటగా ఇది మూడోసారి. ఇప్పటికే వీరు న‌టించిన సింహా – శ్రీరామరాజ్యం సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌న్న కాన్ఫిడెన్స్ అంద‌రిలోను ఉంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య – బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో మ‌రో యాక్ష‌న్ సినిమాకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాను 2019 ఎన్నిక‌ల టైంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పొలిటిక‌ల్ మాస్ మ‌సాలా అంశాల‌తో ఈ సినిమా ఉంటుంద‌ట‌. అయితే బోయ‌పాటి – చెర్రీ కాంబినేష‌న్ కూడా వినిపిస్తున్నా బాల‌య్య కోసం బోయ‌పాటి ఆ ప్రాజెక్టును వాయిదా వేయ‌వ‌చ్చ‌ని కూడా టాక్‌. ఏదేమైనా బాల‌య్య జోరు కుర్ర హీరోల‌ను మించిపోతోంది.