యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు తన తాజా సినిమా జై లవకుశ సినిమాతో పాటు ఇటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ టెంపర్ – నాన్నకు ప్రేమతో- జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తోన్న జై లవకుశ సినిమాకు పవర్, సర్దార్ గబ్బర్సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహించారు.
ఇక ఎన్టీఆర్ కెరీర్లోనే ఫస్ట్ టైం త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమా ఆడియో ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, జై క్యారెక్టర్ టీజర్ సినిమాపై అంచనాలను లెక్కకు మిక్కిలిగా పెంచేసింది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్లో దుమ్ము దులుపుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా జైలవకుశ సినిమా ఉంటుందని చెబుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోకి చీఫ్ గెస్ట్గా బాలయ్యను ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కే సినిమా కావడంతో బాబాయ్ను ఆహ్వానించాలని కళ్యాణ్రామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల ఎన్టీఆర్, బాలయ్య మధ్య కూడా సయోధ్య కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే బాలయ్య ఈ వేడుకకు వస్తే టోటల్ నందమూరి ఫ్యామిలీ అంతా చాలా రోజుల తర్వాత ఒకే వేదిక మీదకు వచ్చినట్లవుతుంది.
ఇక వేళ బాలయ్య వచ్చినా రాకున్నా హరికృష్ణ మాత్రం ఈ ఆడియోకి అటెండ్ అవుతారని తెలుస్తుంది. మరి బాలయ్య ఈ వేడకకు వస్తే టోటల్ నందమూరి, టీడీపీ అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు.