బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావోస్తోంది. ఈ యేడాది తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య పైసా వసూల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఈ సినిమా డైరెక్టర్ కావడంతో సినిమాను చాలా స్పీడ్గా కంప్లీట్ చేసేశాడు.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే షూటింగ్ అనుకున్న టైం కంటే చాలా స్పీడ్గా కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో ట్విస్ట్ వచ్చింది. పైసా వసూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇక దసరా రేసులో సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ జై లవకుశ, సెప్టెంబర్ 27న స్పైడర్, 29న పైసా వసూల్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలకు పోటీగా రావడం కంటే షూటింగ్ ముందే అయిపోవడంతో ఇప్పుడు పైసా వసూల్ను సెప్టెంబర్ 7నే రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
ఇక ఎన్టీఆర్ జై లవకుశ వాయిదా పడితే సెప్టెంబర్ 21న అయినా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా పూరీ దెబ్బతో పైసా వసూల్ సినిమా అనుకున్న టైం కంటే చాలా ముందే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అవ్వడం విశేషమే మరి.