దసరాకు స్పైడర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న సినిమా భరత్ అను నేను. కెరీర్ పరంగా చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న మహేష్కు ఈ సినిమా హిట్ తప్పనిసరి. మహేష్ గత ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్టర్లే. ఒక్క శ్రీమంతుడు ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్. వన్, ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ ఇలా ఈ నాలుగు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు భరత్ అను నేను సినిమా విషయంలో మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సోషల్ + పొలిటికల్ యాంగిల్కు కమర్షియల్ యాంగిల్ జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతికే తేవాలని ముందుగా అనుకున్నారు. అయితే స్పైడర్ రిజల్ట్ తర్వాత మహేష్ కొరటాలతో స్క్రిఫ్ట్లో మార్పులు, చేర్పులు చేయించినట్టు తెలుస్తోంది.
దీంతో భరత్ రిలీజ్ డేట్ సమ్మర్కు వాయిదా వేశారు. ఈ సినిమాను 2018 ఫిబ్రవరి ఎండింగ్కు ముగించి ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక సమ్మర్ కానుకగా ఏప్రిల్ 20న సినిమా వస్తే మహేష్ ఫ్యాన్స్కు పండగ పండగే.