జూనియ‌ర్ మ్యాజిక్‌తో క‌ళ్యాణ్‌కు ఎన్ని కోట్లు లాభ‌మో తెలుసా

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటుడుగా నిర్మాతగా వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. అన్న క‌ళ్యాణ్‌ను ఆదుకునేందుకు మూడు వ‌రుస హిట్ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న తాజా చిత్రం జై ల‌వ‌కుశ సినిమాను అన్న బ్యాన‌ర్‌లోనే చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

అన్న క‌ళ్యాణ్ భారీ న‌ష్టాల‌తో పాటు బ‌య్య‌ర్ల‌కు చెల్లించాల్సిన మొత్తాలు కూడా ఎక్కువ‌గానే ఉండ‌డంతో ఎన్టీఆర్ వీట‌న్నింటి నుంచి అన్నను బ‌య‌ట‌ప‌డేసేందుకే జై ల‌వ‌కుశ సినిమా చేశాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లో వాటా తీసుకున్న ఎన్టీఆర్‌ పారితోషికంగా ఒక్క రూపాయి కూడ పుచ్చుకోలేద‌ట‌. అంతే కాకుండా ఈ సినిమాను త‌క్కువ బ‌డ్జెట్‌తో కంప్లీట్ చేయాల‌ని క‌ళ్యాణ్‌కు స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

అందుకే ఈ సినిమా అంతా త‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేలా ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రించాడ‌ట‌. అందుకే అంత‌గా పేరులేని ద‌ర్శ‌కుడు, హీరోయిన్ల‌తో సినిమా లాగించేసిన‌ట్టు చెపుతున్నారు. సినిమా విష‌యంలో ఎక్క‌డిక‌క్క‌డ ఖ‌ర్చులు బాగా త‌గ్గిస్తూ కేవ‌లం రూ.30 కోట్ల బ‌డ్జెట్‌లోనే సినిమా లాగించేశార‌ట‌. ఇక సినిమాకు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన నేప‌థ్యంలో మ‌రో రూ.30 కోట్ల వ‌ర‌కు ఇత‌ర హ‌క్కుల రూపంలో వ‌చ్చే ఛాన్సులు ఉండ‌డంతో ఓవ‌రాల్‌గా రూ.70-80 కోట్ల వ‌ర‌కు ఈ సినిమాకు నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ లాభాలు వెన‌కేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం తెర‌మీద మూడు పాత్ర‌లు స‌క్సెస్ ఫుల్‌గా పోషించిన ఎన్టీఆర్ తెర వెన‌క ఈ నాలుగో పాత్ర‌ను కూడా అన్న క‌ళ్యాణ్ కోసం చాలా స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించిన‌ట్టు తెలుస్తోంది. ట్విస్టులు, వినూత్న స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 21న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.