అమర్నాథ్‌కు సీటు కష్టాలు..విశాఖ వైసీపీలో రచ్చ..!

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరిగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు సీటు కష్టాలు ఉన్నాయా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లిలో గెలుపు ఈజీ కదా? అందుకే సీటు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గుడివాడ..2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి..ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా […]

కృష్ణుడు అలక..బాబు ఎంట్రీ..తునిలో టీడీపీ డౌన్!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం టీడీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతకాలం తునిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు గాని..ఇప్పుడు టి‌డి‌పి అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతుంది. యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ చేతులో ఉన్న ఈ తునిలో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలిచి..2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ […]

సర్వేపల్లిలో బిగ్ ట్విస్ట్..తొలిసారి సోమిరెడ్డికి ఛాన్స్?

రాష్ట్రంలో అదృష్టం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. మొదట్లో ఏదో అదృష్టం కలిసొచ్చి రెండుసార్లు గెలిచారు గాని..ఆ తర్వాత వరుసపెట్టి ఓటములే సోమిరెడ్డిని పలకరించాయి. రెడ్డి వర్గం నేత అయిన సోమిరెడ్డి..చంద్రబాబుకు వీర విధేయుడుగా ఉన్నారు. ఇక ఈయన 1994, 1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి గెలిచారు. అప్పట్లోనే మంత్రిగా చేశారు. ఆ తర్వాత నుంచి సోమిరెడ్డిని ఓటములు పలకరిస్తూనే ఉన్నాయి. […]

టీడీపీని వదలని వీర్రాజు..పవన్ తేల్చుకోవాల్సిందే.!

ఏపీలో పొత్తుల అంశంలో బీజేపీ చాలా క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది…కలిసొస్తే జనసేనతో పొత్తు ఉంటుందని, లేదంటే ప్రజలతోనే తమ పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంటే జనసేన కలిస్తే ఓకే లేకపోయినా ఓకే అన్నట్లు అన్నారు. అదే సమయంలో మళ్ళీ టీడీపీతో కలిసే ప్రశక్తి లేదని గట్టిగా తేల్చి చెప్పేస్తున్నారు. ఒకవేళ జనసేన గాని టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయ్యి, బీజేపీ కలవాలని చూస్తే…బీజేపీ ఒప్పుకునేలా లేదు. […]

లైన్‌లోకి వచ్చిన లోకేష్..ఎటాకింగ్ స్టార్ట్.!

నిదానంగా నారా లోకేష్ లైన్ లోకి వస్తున్నారు. పాదయాత్రలో స్లో గా అధికార వైసీపీపై ఎటాకింగ్ విమర్శలు మొదలుపెట్టారు. మొదట అనుకున్న మేర పాదయాత్ర హైలైట్ కాలేదు గాని..నిదానంగా పాదయాత్ర పికప్ అవుతుంది..లోకేష్ మాటల దాడి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలని తెలుసుకుని…అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని […]

టీడీపీలో యువతకు భారీగా సీట్లు..బాబు అదిరే స్కెచ్!

రాజకీయాల్లో ఎప్పుడు యువత చాలా కీలకమనే చెప్పాలి. రాజకీయ పార్టీల భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంటుంది..యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత ఎక్కువగా యువ ఓటర్లని ఆకర్షించడం కుదురుతుంది. అయితే ఏపీ రాజకీయాల్లో మెజారిటీ యువత వైసీపీ, జనసేన వైపు ఉన్నారు. టీడీపీ వైపు యువత తక్కువగానే ఉన్నారు. గత ఎన్నికల్లోనే అది అర్ధమైంది. అందుకే అధినేత చంద్రబాబు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అటు నారా లోకేష్ సైతం యువ నేతలకు ప్రాధాన్యత పెరిగేలా చేస్తున్నారు. […]

బందరు-గుడివాడల్లో టీడీపీ మైలేజ్ పెంచుతున్న వైసీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతుంది…గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. కానీ నిదానంగా జిల్లాలో రాజకీయం మారుతుంది. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి కలిసొస్తుంది. అదే సమయంలో వైసీపీ అధికార బలం వాడి టీడీపీని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అదే రివర్స్ అయ్యి ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగేలా చేస్తుంది. తాజాగా మచిలీపట్నం(బందరు), గుడివాడ నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలు టీడీపీకి కలిసొస్తున్నాయి. ఇప్పటికే […]

పెందుర్తి సీటులో రచ్చ..ఎమ్మెల్యేకు చెక్!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ వైసీపీలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అధికార చెలాయించే విషయంలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే సీటు విషయంలో కూడా రచ్చ నడుస్తోంది. చాలా సీట్లలో ఈ పోరు ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తిలో సైతం సీటు విషయంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ […]

వాలంటీర్లపైనే భారం..వైసీపీకి కలిసొస్తుందా?

వైసీపీకి వాలంటీర్లే పెద్ద బలంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు వారు చేతుల్లోనే ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు చూసిన, ఏ మంత్రి చూసిన వాలంటీర్ల నామస్మరణ చేస్తున్నారు. పైగా వారి ఓట్లు పై కూడా డౌట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే పదే పదే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. అంటే వాలంటీర్లు మొత్తం వైసీపీ వైపే ఉండేలా మాట్లాడుతున్నారు. అదే సమయంలో వాలంటీర్లు ప్రతి ఓటరు వైసీపీకి […]