’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]

ఆ నలుగురికీ స్పెషల్ క్లాస్!

విద్యార్థులు అందరికీ కలిపి పాఠం చెబితే అది క్లాసు. కొందరు మొద్దు విద్యార్థులను లేదా కొందరు అత్యంత ఇంటెలిజెంట్ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి.. వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి విడిగా పాఠం చెబితే అది స్పెషల్ క్లాస్. రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరికీ ఉమ్మడిగా క్లాస్ తీసుకుంటే.. ఆ నలుగురికి మాత్రం స్పెషల్ క్లాస్ తీసుకున్నారుట. నాయకులు కంగారెత్తిపోయేలా.. మాట్లాడారట. ఇంతకీ ఆ నలుగురు […]

మధ్యలో దూరితే.. నమ్మేదెవరు?

అమిత్ షా.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక దారి చూపించాడు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడం లక్ష్యం. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటాలు జరుగుతూ ఉంటే వాటన్నింటిలోనూ తలదూర్చమని ఆయన చెప్పాడు. ప్రజలు దేనికోసం ఉద్యమిస్తున్నా సరే.. వారి వెన్నంటి ఉండమని అన్నాడు. ఆ కోటాలో భాగంగానే.. అమరావతి రాజధాని పోరాటంలో భాగం పంచుకోవాలని అనడం కూడా. అమరావతి రాజధాని కోసం రైతులు మహాపాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో.. ఆ పాదయాత్ర తీవ్రత ఏదో […]

పదేపదే అభాసుపాలు.. జగన్ తీరు మారదా?

అమరావతి రాజధాని కేసులకు సంబంధించి రోజువారి విచారణలు ప్రారంభం అయ్యాయి. సీజే ప్రశాంత్ మిశ్రతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు వింటున్నారు. తొలిరోజు అమరావతి రైతుల తరఫున వినిపించిన వాదనల్లో ‘మూడు రాజధానులు’ అనే ఆలోచనే మరచిపోవాలంటూ.. వారు విన్నవించడం జరిగింది. మొత్తానికి రోజువారీ విచారణల పర్వం మొదలైంది గనుక.. అమరావతి రాజధాని విషయంలో తొందరల్లోనే ఒక నిర్ణయం వస్తుందని.. అమరావతా? మూడు రాజధానులా? అనే విషయంలో కోర్టు పరంగా ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అనుకోవచ్చు. […]

కేటీఆర్ ను చూసి అందరూ షాక్.. ఆయన సీఎం కాదు కదా?

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు ప్రైవేటు పెట్టుబడులు ఎలా రాబట్టాలి అనేది టాపిక్. అందరిలాగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు హాజరు కావాలి. ప్రగతి భవన్ నుంచి ఈ సమావేశం నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా సమావేశానికి హరీశ్ రావుతోపాటు సీఎం కేసీఆర్ కాకుండా ఆయన కుమారుడు […]

కారు కావాలా.. కియా కార్నివాల్ ఉందిగా..

పార్టీ అధినేతలకు, ప్రభుత్వ పెద్దలకు కోపం, ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలియదు.. అర్థం కాదు.. కోపం వచ్చిన వెంటనే ప్రేమ పొంగుకొస్తుంది.. ప్రేమ చూపిన మరుక్షణమే కోపంగా మారిపోతారు. అందుకే వారిని అర్థం చేసుకోవడం కష్టం. సరే అనడం తప్ప ఏమీ చేయరాదు. ఇంతకీ అసలు విషయమేమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కియా కార్ కార్నివాల్ అంటే ఎందుకో ప్రేమ ఎక్కువైన్నట్లుంది. కారు అంటేనే కియా కార్నివాల్.. ఇక ప్రపంచంలో అంతకుమించి కార్లున్నాయా.. దానిని కాక దేనిని […]

సారుకు సడన్ గా రోడ్లెందుకు గుర్తుకొచ్చాయో?

కాస్త ఆలస్యమైనా ఏపీ సీఎం జగన్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని.. ఒక్క గుంత కూడా రోడ్డుపై కనిపించరాదని అధికారులను ఆదేశించారు. 46వేల కిలోమీటర్ల రోడ్లను జూన్ 2022లోపు మరమ్మతులు చేయాలని, రోడ్లన్నీ క్లీన్ గా కనిపించాలని పేర్కొన్నారు. ఈనెలాఖరు నాటికి 8268 కిలోమీటర్ల రోడ్లకు రిపేరు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కూడా ఆదేశించారు. పల్లె, పట్టణం, మునిసిపాలిటి, కార్పొరేషన్, రాష్ట్ర.. […]

పోటీచేద్దామా? వద్దా? ఏం చేద్దామంటారు?

కాంగ్రెస్ పార్టీ.. వందేళ్ల ఘన చరిత్రగల అతి పెద్ద రాజకీయ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న పార్టీ..అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ.. ఇవీ కాంగ్రెస్ పార్టీ గురించి క్లుప్తంగా చెప్పదగ్గవి.. ఈ విషయాలన్నీ ఇపుడు ఎందుకంటే.. ఇంత ఘన చరిత్రగల పార్టీ ఇపుడు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో […]

దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]