ద్వితీయశ్రేణి కేడర్ లో అసంతృప్తి.. గుర్తించని గులాబీ బాస్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నాం.. అయినా మాకు వచ్చిందేమీ లేదు.. మేము బాగుపడిందీ లేదు.. పార్టీ కోసం లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేశాం.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మా వంతు కష్టం మేం పడుతున్నాం.. పక్కనుంచి వచ్చేవాళ్లకే గుర్తింపుఉంది కానీ.. మాకెక్కడ అంటూ పలువురు నాయకులు వాపోతున్నారు. అక్కడక్కడా ఈ అసంతృప్తి బహిర్గతమవుతున్నా అధినేత దృష్టికి ఈ విషయం వెళ్లడం […]

హుజూరాబాద్ ఓటర్లకు లేఖలు రాస్తున్న టీఆర్ఎస్ పార్టీ

’’గౌరవనీయులైన ఓటరు గారికి.. మేము చేపట్టిన సంక్షేమ పథకాలు చూడండి.. ఓటేయండి..‘ అంటూ టీఆర్ఎస్ పార్టీ ఇపుడు లేఖలు రాయబోతోంది. ఓటర్లకు పార్టీలు ఎప్పుడైనా లేఖలు రాయడం విన్నారా.. ఓటర్లే పార్టీలు, నాయకులకు వినతిపత్రాలు ఇవ్వడం చూశాం కానీ.. మొత్తం నియోజకవర్గ ఓటర్లందరికీ లేఖలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఎటు పోయి ఎటు తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అరె.. ఉప ఎన్నికలకు ఇంత సీన్ […]

ఆంధ్రలో కొత్త కరోనా రూల్స్..?

కరోొనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ రాబోయే ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా రూల్స్ ను చాలా మంది బ్రేక్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు పెట్టక తప్పలేదు. ఏపీలో అయితే కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీలో సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల […]

అంబటి రాంబాబు.. మరొక ఆడియో వైరల్..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సంబంధించిన కొన్ని ఆడియోలు ఇటీవల కాల్ ఆలయంలో అదేపనిగా లీక్ అవుతున్నాయి. తాజాగా సుకన్య అనే మహిళతో కొన్ని సంభాషణలు జరిపినట్లు ఉన్నటువంటి ఒక ఆడియో సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ గా మారుతుంది. ఎక్కువగా ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలే కావాలనే వైరల్ చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం లక్ష్మీపార్వతి అనే ఆమెతో అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తించినట్లు ఒక ఆడియో టేప్ బయటకు […]

ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా బీఎస్పీ పార్టలో చేరారు. ఆయన పార్టీ కండువా ఇలా కప్పుకున్నారో లేదో.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో ఆర్ఎస్పీ (ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) పొలిటికల్ కెరీర్ మొదలైనట్లే. పార్టీలో చేరిన సందర్భంగా ఆర్ఎస్పీ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. దళితులకు కావాల్సింది దళిత బంధు కాదు.. అధికారం అన్నట్లు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని అన్ని పార్టీల నాయకులు […]

హుజూరాబాద్ బై పోల్స్.. ఎన్నికల సంఘానికి టెన్షన్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గంలో.. త్వరలో జరిగే ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఆయా పార్టీలు గెలుపు బాటకు ఎవరికి వారు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంటే.. ఉద్యమకారులు, నిరుద్యోగులు, నేతన్నలు ..ఇలా ప్రభుత్వంపై ఆక్రోశం ఉన్న వారంతా తాము నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వానికి తమ సత్తా చూపాలంటే హుజూరాబాద్ లోనే చూపాలని.. అప్పుడైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని వారి భావన. దాదాపు 2200 మంది హుజూరాబాద్ […]

కోర్టు ఖర్చులకే కోట్ల రూపాయలు ఖర్చుపెడితే ఎలా..?

1,2 కాదు.. ఏకంగా 58 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కారు ఖర్చు పెట్టింది. అదేం ప్రజాప్రయోజనాల కోసం కాదు.. కోర్టు ఖర్చుల కోసమట.. ఈ విషయం తెలిసీ కోర్టు కూడా నివ్వెరపోయింది..ఇదేంటి.. ఇంత మొత్తం ఖర్చు పెట్టారు అంటే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయనతోపాటు రెవెన్యూ, ఫైనాన్స్ కార్యదర్శులకు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్ తో ఈ […]

శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]

రేవంత్ లో అయోమయం.. అందుకే రాహుల్ రాక..

హుజూరాబాద్ ఎన్నికల వ్యవహారంలో కారు దూసుకుపోతుంటే.. బీజేపీ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అయోమయంలో పడిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలు దాదాపు అభ్యర్థిని ప్రకటించికపోయినా వారికో క్లారిటీ ఉంది. ఎవరిని బరిలో దించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఇంకా ఎవరు అనే విషయం కొలిక్కి రాలేదు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ చీఫ్ సమావేశం నిర్వహించినా […]