కొవిడ్ మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఆక్సిజన్ అందక వందలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరోవైపు కరోనా బాధితులకు ఏడాది వైద్యాధికారులు అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు మూర్ఖులు వైద్యసిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల మాస్క్లను పెట్టుకోవాలని సూచించిన ఓ నర్స్పై, శానిటేషన్ సిబ్బందిపై ఇద్దరు యువకులు దాడులకు దిగారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొక వెలుగుచూసింది. ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ మల్లీశ్వరి […]
Category: Politics
ఒక్క వైన్బాటిల్ ధర రూ.7కోట్లు..!
సాధారణ లిక్కర్ తో పోల్చితే వైన్ ధర కాస్తా ఎక్కువగానే ఉంటుంది. వైన్ ఎంత పురాతనమైనది అయితే అంత కిక్కుతోపాటు, అంతే ఎక్కువ ధర పలుకుతుంటుంది. అందుకే పాత వైన్ కోసం మద్యం ప్రియులు వేలు, కాదు లక్షల రూపాయాలనైనా వెచ్చిస్తారు. వాటన్నింటిని తలదన్నే విధంగా ఓ మద్యం బాటిల్ విలువ కోట్ల రూపాయల ధర పలుకుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అంత ధర ఎందుకంటే అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్ కావడమే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో […]
ఈటలపై ఎన్నారైల ఆగ్రహం..!
మాజీమంత్రి, టీఆర్ ఎస్ తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ వ్యవహారంపై అమెరికా ఎన్నారైల కోర్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు పట్ల ఎన్నారైలు చర్చించి స్థిరమైన సంక్షేమ పాలన కేసీఆర్ తోనే సాధ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ మరియు సమాజహితం ముఖ్యమన్నారు. సబ్బండ వర్గాలకు కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కెసిఆర్ గారి నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు సంపూర్ణ మద్దతు […]
స్మశానానికి స్వాగతం.. బీజేపీ శవరాజకీయాలు..!
రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తుంటారు. తమ ఇమేజ్ను పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. పోస్టర్లను వేసుకుంటూ హోరెత్తిస్తుంటారు. అయితే కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు ఆఖరికి కొవిడ్ మరణాలను కూడా తమ ప్రచారానికి వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మశానానికి స్వాగతం అంటూ కట్టిన ఫ్లెక్సీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం కర్నాటక రాష్ట్రం నెలమంగల తాలూకా […]
బెంగాల్లో జేపీ నడ్డా శపథం.. ఏమిటంటే..?
ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికిన కాషాయదళం ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేతిలో ఘోర పరాభవాన్ని పొందింది. ఇదిలా ఉండగా ఎన్నికలకు ముందు బీజేపీ అనుసరించిన దాడులను ఎన్నికల అనంతరం టీఎంసీ నేతలు కొనసాగిస్తున్నారు. వరుసగా బీజేపీ క్యాడర్పై దాడులకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ హడావుడిగా బెంగాల్లో పర్యటించారు. మమతాబెనర్జీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఆయన […]
హనీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో తపిస్తారు. వారి బాగుకోసం జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం తన సుఖం కోసం కొడుకునే బేరానికి పెట్టాడు. రెండో భార్యతో కలిసి హనీమూన్కు వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని విక్రయించాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, […]
మేయర్ నియామకానికి టీఆర్ ఎస్ పరిశీలకులు వీరే..!
ఇటీవల జరిగిన రెండు మున్సిపల్ కార్పొరేషన్, ఐదు మున్సిపాల్టీల్లో టీఆర్ ఎస్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. రెండు మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల ను, ఐదు మున్సిపాలిటీలకు శుక్ర వారం జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు పార్టీ తరపున పరీశీలకుల పేర్లను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల […]
ఏపీ బాలికకు కేసీఆర్ తనయ సాయం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుంటారు. కొవిడ్ సమయంలో నిజామాబాద్ కేంద్రంలో నిరవధికంగా అన్నదానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్, మస్కట్ తదితర అరబ్ దేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రజాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ […]
కమల్ ఓటమిపై శ్రుతి హాసన్ ఎలా స్పందించిందంటే?
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. కానీ, కమల్కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా తమిళులు ఇవ్వలేదు. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 142 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇక కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో […]