వైసీపీని స్మాష్ చేసేందుకు బాబు మాస్ట‌ర్ ప్లాన్‌

పాలిటిక్స్ అన్నాక ఎత్తులు, పై ఎత్తులు కామ‌న్‌. అయితే, 2050 వ‌ర‌కు ఏపీలో అధికారంలో ఉండాల‌ని గ‌ట్టి నిర్ణ‌యం మీదున్న టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబు ప్లాన్ మాత్రం అదిరిపోతోంది. సాధార‌ణంగా అంద‌రూ ల‌క్ష్యాలు పెట్టుకుంటారు. కానీ, వ్యూహాలు లేక వాటిని సాధించ‌లేక‌.. చ‌తికిల ప‌డుతుంటారు. కానీ, బాబు అలా కాదు.. 2019 అపై 2024. ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ల‌క్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆదిశ‌గా దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్పుడు అమ‌లు చేస్తున్న మాస్ట‌ర్ అదిరిపోయే రిజ‌ల్ట్ ఇస్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

రాష్ట్రంలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైసీపీ.. టీడీపీని ఢీ అంటే ఢీ అంటోంది. ఈ క్ర‌మంలో ఈ పార్టీని నామ‌రూపాలు లేకుండా చేస్తేనే టీడీపీ పూర్తిస్థాయిలో అధికారంలో ఉండ‌గ‌లుగుతుంది. ఇది సాధించాలంటే.. జ‌నాల్లో టీడీపీ ఎప్పుడు విజ‌యంతోనే స‌వారీ చేస్తుండాలి. దీనిని అర్ధం చేసుకున్న బాబు.. త‌న పూర్వ రాజ‌కీయ అనుభ‌వంతో .. అదిరిపోయే ప్లాన్ వేశారు. వైసీపీని చిత్తు చేసేలా సిద్ధం చేసిన ఆ ప్లాన్‌ను నంద్యాల నుంచే అమ‌లు చేస్తున్నారు. అదికూడా ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో జ‌గ‌న్‌ను ఎదుర్కొనేందుకు, త‌న అధికారాన్ని నిలుపుకొనేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబు తీవ్రంగా శ్ర‌మించారు. ఇక్క‌డ విజ‌యం సాధించ‌డం ద్వారా 2019 పోరులో విజ‌యానికి బాట ప‌రుచుకోవాల‌ని భావించారు. ఈ నేప‌థ్యంలో విజ‌యం సాధించారు కూడా. ఇక‌, దీనిని వెన్నంటే.. మంగ‌ళ‌వారం కాకినాడ‌లో కార్పొరేష‌న్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిలోనూ విజ‌యం సాధించ‌డం ద్వారా బాబు మ‌రింత‌గా ప్ర‌జ‌ల మ‌నిషిగా నిరూపించుకునే ప్రయ‌త్నం చేయ‌నున్నారు.

ఆ త‌ర్వాత విశాఖ‌, ఆ త‌ర్వాత రెండు నెల‌ల‌కు గుంటూరు, ఆ త‌ర్వాత రెండు నెల‌ల‌కు తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌లు పెడుతూ ఇలా ప్ర‌తి రెండు నెల‌ల‌కు వ‌రుస‌గా ఎన్నిక‌లు పెడుతూ టీడీపీ గెలుపును చాటుతూ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుకు వైసీపీని మ‌రింత వీక్ చేయ‌డమే టార్గెట్‌గా బాబు మాస్ట‌ర్ ప్లాన్ అమ‌లు చేస్తున్నారు. మ‌రి దీనిని స‌మ‌ర్ధంగా త‌ట్టుకుని అధికార పార్టీ ఎత్తుల‌ను చిత్తు చేయ‌గ‌ల వ్యూహం వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌ద్ద ఉందా? అంటే.. ఉన్న‌దంతా కేవలం ఆవేశం మాత్ర‌మే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.