స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక సెన్సార్ టాక్ ప్రకారం సినిమాకు పర్లేదన్న టాక్ వస్తోంది.
ఫస్టాఫ్ కామెడీ, రొమాంటిక్ యాంగిల్లో కంటిన్యూ అయిన సినిమా, సెకండాఫ్లో యాక్షన్ ఎలిమెంట్స్తో ఉంటుందట. ఇక సినిమాలో కథతో పాటు బన్నీ డ్యాన్సులు, హరీశ్ శంకర్ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. ఫస్టాఫ్లో హరీశ్ శంకర్
బన్నీ క్యారెక్టర్తో పాటు కామెడీ సీన్లు సూపర్బ్గా ప్రజెంట్ చేశాడని టాక్ బయటకు వచ్చింది.
ఇక సెకండాఫ్లో మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేసేలా ట్విస్టుల మీద ట్విస్టులతో హరీశ్ సినిమాను తెరకెక్కించాడట. ఇక క్లైమాక్స్ యాక్షన్ టచ్తో కామెడీ మిక్స్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సైతం సినిమా పట్ల పాజిటివ్గానే స్పందించారని సమాచారం. అయితే రన్ టైం మాత్రం కాస్త ఎక్కువే అంటున్నారు. మరి డీజే ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో ? తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.