యంగ్టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా స్టార్ మా ఛానెల్ నిర్వహిస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్లీ షో బిగ్ బాస్. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీక్ ముగిశాక జ్యోతిని ఫస్ట్ ఎలిమినేటర్గా బయటకు పంపేశాడు ఎన్టీఆర్. బయటకు వచ్చిన జ్యోతి ఇప్పుడు తిరిగి బిగ్ బాస్లో రీ ఎంట్రీ ఇస్తుందా ? అంటే అవునన్న సందేహాలు వస్తున్నాయి.
బయటకు వెళుతోన్న జ్యోతిని ఎన్టీఆర్ హౌస్లో జరిగిన పలు అంశాలపై ప్రశ్నించి, ఆమె అభిప్రాయాలు తెలుసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ జ్యోతికి ఓ హింట్ కూడా ఇచ్చాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ? తెలియదు మీరు అలెర్ట్గా ఉండాలని చెప్పాడు. ఈ హింట్ను బట్టి జ్యోతి బిగ్ బాస్ హౌస్లో రీ ఎంట్రీ ఇస్తుందన్న
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన జ్యోతిని సాగనంపే క్రమంలో జ్యోతికి తారక్ ఓ హింట్ ఇచ్చాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు అలర్ట్ గా ఉండడని అన్నాడు. అంటే బిగ్ బాస్ నుండి మళ్లీ జ్యోతికి కాల్ వచ్చే అవకాశం ఉందేమో అని డౌట్ పడుతున్నారు.
ఇక ఇప్పుడిప్పుడే షోపై క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇక డ్రగ్స్ విచారణలో మమైత్ఖాన్ కూడా షో నుంచి బయటకు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రియాలిటీ షో ఎలాంటి కొత్త మలుపు తీసుకుంటుందో చూడాలి.