మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా. రిలీజ్కు ముందే మంచి హైప్ తెచ్చుకుని శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వరుణ్తేజ్ ఎన్నారైగా, సాయిపల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించిన ఈ సినిమాలో లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఫస్ట్ వీకెండ్లోనే 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందని యూఎస్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్లో ఫిదా 113 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. శుక్రవారం రోజునే 2,16,000 డాలర్లు వసూలు చేసింది.
ఓవర్సీస్లో లాంగ్ రన్లో ఫిదా 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా మొదటి రోజు రూ. 3 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.