మంత్రి పదవి ఆశించి భంగపడిన వారిలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ఒకరు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించిన ఆయనకు ఈసారి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఇక ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఆయనో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తిలో రగిలిపోతున్న ఆయన.. ఇప్పుడు జనసేనలో చేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అంతేగాక ఈ విషయంపై అధినేత పవన్ కల్యాణ్తోనూ మంతనాలు జరిపారట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. జసనసేనకు ఆయన సిద్ధాంతకర్తగా నియమితులయ్యే అవకాశముందట.
కేబినెట్లో స్థానం దక్కకపోవడంతో చిత్తూరు జిల్లాకు చెందిన ముద్దు కృష్ణమనాయుడు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. టీడీపీ స్థాపించినపుడు ఎన్టీఆర్ వెనుకే ఉన్నారు. తదనంతర పరిణామాలతో ఆయన చంద్రబాబు కోటరీలోకి మారిపోయారు. అప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన పార్టీ వెన్నంటే ఉన్నారు. ఆ నమ్మకంతోనే మంత్రి పదవిపై ఆశలుపెట్టుకున్నారు.
ముఖ్యంగా చిత్తూవరుకు చెందిన బొజ్జల గోపాలకృష్ణ స్థానంలో తనకు అవకాశమిస్తారని ఎంతగానో ఆశించారు. కానీ ఆయన ఆశలు అడియాశలయ్యాయి. చివరకు వైసీపీ నుంచి పార్టీలో చేరిన అమర్నాథ్రెడ్డికి ఆ అవకాశం దక్కింది, దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలని బలంగా నిర్ణయించుకున్నారట. ఆయన్ను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగినా.. ఫలితం లేకపోయిందట. ఇక పార్టీకి రాజీనామా చేయాలని బలంగా డిసైడ్ అయ్యారట. అంతేగాక జనసేనలో చేరితో ఎలా ఉటుందనే చర్చిస్తున్నారట. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్తోనూ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఇంకా పార్టీపై దృష్టిసారించని పవన్.. సీనియర్ నాయకులు చేరితే తనకూ కొంత బలంగా ఉంటుందని భావిస్తున్నారట. ఈ మేరకు గాలి ముద్దు కృష్ణమనాయుడితో సానుకూలంగా మాట్లాడారని తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే జనసేనకు సిద్ధాంతకర్తగా ఆయన నియమితులయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరి టీడీపీకి బద్దుడైన ఆయన.. పార్టీ మారతారో లేదో వేచిచూడాల్సిందే! జనసేనలో చేరితో పవన్కు కొంత బలం పెరిగినట్టే!!