రజనీకాంత్ – శంకర్ కాంబోలో వస్తోన్న 2.0 సినిమాపై భారతదేశ సినీ చరిత్రలోనే భారీ అంచనాలు ఉన్నాయి. రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ గురించి ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటకు వచ్చింది.
రోబో 2.0 ఆడియోను దుబాయ్లో రూ. 25 కోట్ల భారీ ఖర్చుతో చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు శంకర్ ఆరు నెలల టైం కేటాయించాడు. ఇక దుబాయ్లో జరిగే ఈ వేడుకకు పలువురు హాలీవుడ్ స్టార్స్ సైతం వస్తున్నట్టు తెలుస్తోంది. రజనీ సరసన బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ విలన్గా నటిస్తున్నారు.