మూడు వరుస హిట్లతో టాలీవుడ్లో తిరుగులేని స్టార్గా దూసుకుపోతున్నాడు యంగ్టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ. షూటింగ్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
ఎన్టీఆర్ తిరుగులేని క్రేజ్తో ఈ సినిమా రిలీజ్కు ముందే రూ. 35 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్రామ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు ఏపీ, తెలంగాణతో పాటు రూ. 95 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ లెక్కన ఈ సినిమాకు ఇప్పటికే రూ. 35 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఇక గతంలో తన బ్యానర్పై చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో బయ్యర్లకు భారీగా బకాయిలు పడ్డ కళ్యాణ్రామ్ అప్పులన్ని ఈ సినిమాతో తీరిపోతున్నాయి. దీంతో కళ్యాణ్ కూడా జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్తో మాంచి జోష్లో ఉన్నాడట.