నిశిత్ మరణంతో పవన్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైయ్యాడా!

నారాయణ గ్రూప్ అధినేత మరియు ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికి తెలిసిందే ఆ ప్రమాదానికి గురిఅయిన కార్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మారు మోగుతున్నాయి, ప్రమాదానికి గురైన బెంజ్ కారు అస‌లు ఓన‌ర్‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అట‌. అందుకే ప్రమాద విష‌యం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్రమాద స్థలానికి వెళ్లార‌ట‌. పవన్ కార్ అయితే నిశిత్ దగ్గర ఎందుకు ఉందని సందేహం రాక మానదు, దానికి బదులుగా ఇప్పుడు కొన్ని వార్తలు బయట నడుస్తున్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ఇష్టమైన మెర్సిడ‌స్ బెంజ్ కారును 1.15 కోట్ల ఖ‌ర్చుపెట్టి  2011  కొనుగోలు చేశాడు. రాంచరణ్ పెళ్లి రోజున పవన్ స్వయానా తన కార్ లో రాంచరణ్ ఎక్కించుకొచ్చాడు. అయితే కొన్ని రోజుల తరువాత పవన్ ఆర్థికంగా లేక పాత కారు కావటం తో పలు కారణాలతో తన కారు అమ్మేశాడు. అప్పుడు నిశిత్ సీన్ లోకి వచ్చాడు. స్వతహాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిశిత్ త‌న తండ్రిని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ అభిమాన హీరో న‌డిపిన కారు కొనుగోలు చేశార‌ని వినికిడి.

అయితే ఇప్పుడు త‌న కారులోనే ఘోర ప్రమాదానికి గురై నిశిత్ మ‌ర‌ణించ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రమాద విష‌యం తెలియ‌గానే అక్కడికి చేరుకుని నిశిత్ భౌతిక దేహాన్ని, నుజ్జున‌జ్జయిన త‌న‌కారును చూసి చ‌లించిపోయార‌ట‌. మ‌రి ఇదెంత వ‌ర‌కు నిజ‌మో ప‌వ‌న్ క‌ళ్యాణే చెప్పాలి. దీనికి తూడు ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో కొన్ని పవన్ చేసిన కొన్ని కామెంట్స్ దీనికి ఊతమిచ్చాయి ఖరీదైన కార్ల అంశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్‌ స్పందిస్తూ.. ‘గతంలో నాకు బెంజ్‌కారు ఉండేది.. వాయిదాలు కట్టలేక అమ్మేశా’ అని పవన్ జవాబు ఇచ్చాడు.

Pawan Benz car