బ్రేకింగ్‌: ‘ జై ల‌వ‌కుశ ‘ ఆడియో ఫంక్ష‌న్ క్యాన్సిల్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎప్పుడో ఎనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆడియో రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేయాల‌ని నిర్మాత కళ్యాణ్‌రామ్ భావించాడు.

అయితే తాజాగా జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ క్యాన్సిల్ అయిన‌ట్టు నిర్మాత క‌ళ్యాణ్‌రామ ప్ర‌క‌టించారు. ముందుగా ఈ సినిమా ఆడియోను సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో రిలీజ్ చేయాల‌ని భావించారు. ఆడియో వేడుక‌ను కూడా పెద్ద ఎత్తున చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే న‌గ‌రంలో కొద్ది రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో పాటు గ‌ణేష్ నిమ‌జ్జ‌నం పెద్ద ఎత్తున జ‌ర‌గ‌నుండ‌డంతో క‌ళ్యాణ్ త‌మ సినిమా ఆడియో ఈవెంట్ వ‌ల్ల న‌గ‌ర ప్ర‌జ‌ల‌తో పాటు ఎవ్వ‌రికి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

కాగా జై ల‌వ‌కుశ ఆడియో సెప్టెంబ‌ర్ 3న మార్కెట్లోకి డైరెక్టుగా రిలీజ్ కానుంది. ఇక ఈ ఈవెంట్ ర‌ద్దు అయినందుకు గాను ఫ్యాన్స్‌కు నిరాశ లేకుండా వారి కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో వేడుక నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. సెప్టెంబర్ 21న జై ల‌వ‌కుశ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు.

NTR Twitter