టాలివుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజా సినిమా జయజానకీ నాయక. గతేడాది సరైనోడు లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఇప్పుడు జయజానకీ నాయకతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీను – రకుల్ ప్రీత్ సింగ్ – ప్రగ్య జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది. ఈ సినిమా బిజినెస్ రూ. 45 కోట్లు జరిగిందంటే అది బోయపాటి స్టామినాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
జయజానకీ నాయక తెలుగు శాటిలైట్ హక్కులు 5.5 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. అలానే హిందీ డబ్బింగ్ రైట్స్ 7 కోట్లకి – నైజాం 9.5 కోట్లకి – ఆంధ్ర ఏరియా మొత్తం 20 కోట్లకి – సీడెడ్ 7.2 కోట్లకి సేల్ అయినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. బెల్లంకొండ శ్రీను గత సినిమాలకి రాని క్రేజ్ ఈ సినిమాకి రావడానికి కారణం బోయపాటి అన్నది తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లకు ఈ ట్యూబ్లో సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ జానకీ నాయకుడు రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడో ? చూడాలి.