ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేస్కోండి

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక పండ‌గ చేసుకోవ‌చ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ రిలీజ్ డేట్‌ను రంజాన్ సంద‌ర్భంగా ఎనౌన్స్ చేశారు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రాం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జై లవకుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభియనం చేస్తున్నారు. జులై మొదటివారంలో టీజర్ రిలీజ్ చేస్తారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ బాబాయ్ బాల‌య్య పైసా వ‌సూల్ సినిమా సైతం ఈ సినిమా త‌ర్వాత వారం రోజుల గ్యాప్‌లో సెప్టెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.